Sunday, April 28, 2024
Home Uncategorized మేనిఫెస్టోలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను చేర్చాలి : ఎస్‌.టి.యు

మేనిఫెస్టోలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను చేర్చాలి : ఎస్‌.టి.యు

- Advertisement -

రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలు తమ వైఖరిని తెలుపుతూ మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌.టి.యు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, మల్లు రఘునాథరెడ్డిలు కోరారు. ఆదివారం విజయవాడ లోని దాసరి భవన్‌ నందు జరిగిన ఉపాధ్యాయ వైజ్ఞానిక శిక్షణా తరగతులు సందర్భంగా వారు మాట్లాడుతూ… రా సిపిఎస్‌ ఉద్యోగులందరికి సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జివో 117 రద్దు చేయాలని, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలన్నారు. కొఠారి కమీషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలన్నారు. ఇప్పటివరకు కేంద్ర బడ్జెట్‌లో 3 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 11-12 శాతం మించి కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచేలా, పై సమస్యలన్నింటిపై మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో ఎఐఎస్‌టిఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కత్తి నరసింహారెడ్డి, ఎఐఎస్‌టిఎఫ్‌ ఆర్థిక కార్యదర్శి సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌ బాబు, ఉపాధ్యాయవాణి సంపాదకులు గాజుల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సురేష్‌ బాబు, సుబ్రహ్మణ్యం రాజు, రామచంద్రయ్య, కె.వి.రామచంద్రరావు, పి.రమణారెడ్డి, శివప్రసాద్‌, కడియాల మురళి, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...