Home వార్తలు Tragedy: బ్రాంచ్ కాలువలోకి దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..

Tragedy: బ్రాంచ్ కాలువలోకి దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..

Tragedy: జిల్లాలోని అద్దంకి బ్రాంచ్ కాలువ వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బల్లికురవ మండలం గుంటుపల్లికి చెందిన చిరంజీవి (36) తన ఇద్దరు పిల్లలు చైతన్య కృష్ణ (9), సాయి సౌమ్య (8) మంగళవారం రాత్రి నుండి కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. అయితే వీరు అద్దంకి బ్రాంచ్ కాలువ వద్ద బైకు, చెప్పులు, వారి వస్తువులు వదిలి కాలువలోకి దూకారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గల్లంతైన వారి ఆచూకి కోసం అద్దంకి బ్రాంచ్ కాలువలో స్థానికులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వీరు ఆత్మహత్యాయత్నంకు పాల్పడటానికి కుటుంబ కలహాలా, లేక ఆర్ధిక ఇబ్బందులా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Exit mobile version