Home వార్తలు Prakasam News: గురుకల పాఠశాల విద్యార్ధులపై ఉపాధ్యాయుల దాష్టీకం..

Prakasam News: గురుకల పాఠశాల విద్యార్ధులపై ఉపాధ్యాయుల దాష్టీకం..

Prakasam News: కడుపు నిండా అన్నం పెట్టమని అడిగినందుకు విద్యార్ధుల శరీరంపై వాతలు తేలేలా కొట్టి తమ దాష్టీకం ప్రదర్శించిన  ఉపాధ్యాయుల వైనమిది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్ధులు తమకు సరిగా అన్నం పెట్టమని అడిగినందుకు ఉపాధ్యాయులు వాతలు తేలేలా కొట్టారు. అయితే విద్యార్ధులను కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఉపాధ్యాయులు భయపడ్డారు. ఉపాధ్యాయులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు విద్యార్ధులు గురుకుల పాఠశాల నుండి పారిపోయారు.

అయితే ఉపాధ్యాయులు కొందరు వారిని వెంబడించి పట్టుకుని స్కూల్ కు తీసుకువచ్చి దాచారు. ఈ విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు. ఇప్పటికే విద్యార్దులను ఉపాధ్యాయులను కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Exit mobile version