Home వార్తలు Prakasam News: భార్యకు కరోనా నిర్ధారణ… హోమ్ ఐసొలేషన్ లో మంత్రి బాలినేని..!!

Prakasam News: భార్యకు కరోనా నిర్ధారణ… హోమ్ ఐసొలేషన్ లో మంత్రి బాలినేని..!!

Prakasam News: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. సామాన్యులు మొదలుకొని ప్రజా ప్రతినిధులు, నేతలు కరోనా బారిన పడుతున్నారు. గతంలో కరోనా బారిన పడి కోరుకున్నవారు మరోసారి మళ్లీ బాధితులు అవుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మూడోసారి కరోనా బారిన పడ్డారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి బాలినేని కూడా హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆ నేతలందరూ స్పందిస్తూ తమను ఇటీవల కాలంలో కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Exit mobile version