Home వార్తలు Accident: కార్మికులపై దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి

Accident: కార్మికులపై దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి

Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రోడ్డు వద్ద డివైడర్ పనులు చేస్తున్న కార్మికులపై ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది. మృతులు శ్యామ్, అంకర్ల లక్ష్మి, కవిత తో పాటు మరొకరు ఉన్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొనడం వల్లనే ఈ పమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను పోలీసులు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version