Home వార్తలు Accidents: వేరువేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి..

Accidents: వేరువేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి..


Accidents: రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందగా, అయిదుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండల కేతముక్కల అగ్రహారం వద్ద ప్రమాదవశాత్తు పాల ఆటో బావిలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో రావిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాలగాని అనిల్ కుమార్ (28) మృతి చెందాడు. కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ -జులకల్ మార్గంలో ఆటో – ద్విచక్ర వాహనం ఢొకన్న ఘటనలో పోలకల్ గ్రామానికి చెందిన విద్యార్ధి బోయ సోముడు (16) మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు.

పిల్లలతో బావిలో దూకిన తల్లి

కర్నూలు జిల్లా పూలతోటకు చెందిన వివాహిత మనీషా కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పునీత్ రెడ్డి, దేవిశ్రీలు మరణించగా, మనిషాను స్థానికులు కాపాడారు. మనిషాకు 2016లో పవన్ కుమార్ రెడ్డితో వివాహం జరగ్గా కుటుంబ కలహాలతో పుట్టింటికి చేరుకుని పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది.

Exit mobile version