Home వార్తలు Breaking: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం..నలుగురు మృతి

Breaking: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం..నలుగురు మృతి

Breaking: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. మంగళగిరి మండలం యర్రబాలెం చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న తేజారామ్, నరేంద్ర కుమార్, సాయి, శ్రీనివాస్ మృతి చెందారు. మృతులు విసన్నపేట మండలం పుట్రేల వాసులుగా గుర్తించారు. కారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. చెరువులో నుండి కారును స్థానికులు బయటకు తీశారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Exit mobile version