Home వార్తలు Crime News: ప్రకాశంలో దారుణం .. తాగిన మైకంలో కన్నకొడుకునే కడతేర్చిన తండ్రి

Crime News: ప్రకాశంలో దారుణం .. తాగిన మైకంలో కన్నకొడుకునే కడతేర్చిన తండ్రి


Crime News: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో కన్నకొడుకునే తండ్రి హతమార్చిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఇందిరా కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇందిరా కాలనీకి చెందిన రాచూరి హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హుస్సేన్ కు తన ఒక్కగానొక్క కురుడు వీరాంజనేయులు (24)కు ఇటీవల వివాహం చేశాడు. అయితే తండ్రీ కొడుకులు ఇద్దరూ తరచు మద్యం సేవించి గొడవ పడుతుండేవారు. దీంతో వీరాంజనేయులు భార్య పుట్టింట్లోనే ఉంది.

హుస్సేన్ శుక్రవారం రాత్రి పూటుగా మద్యం సేవించి కొడుకు వీరాంజనేయులుతో గొడవ పట్టాడు. అయితే మధ్యం మత్తులో విచక్షణ మరిచి కొడుకుపై రోకలిబండతో బాదడంతో పాటు కత్తితో పొడిచాడు. దీంతో అతను చనిపోయాడు. ఆ తరువాత హుస్సేన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరాంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version