AP Nominated Posts: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల జాబితా ప్రకటించింది. మొత్తం 135 పోస్టుల్లో 56 శాతం అంటే 72 పోస్టులు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన ప్రభుత్వం. మహిళలకు సగం పదవులు కేటాయించిన సీఎం జగన్. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే… శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు, విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు, విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు కేటాయించారు. జిల్లాల వారీగా సామజిక సమీకరణాలు, రాజకీయ మార్గాలు అన్నిటినీ చూస్తూ కేటాయించారు..!
టీటీడీ చైర్మన్ గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డిని కొనసాగించుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన మంత్రి పదవి ఆశించినప్పటికీ.. ఈ సారికి ఏడాది పాటూ టీటీడీ చైర్మన్ పదవినే కేటాయించారు. ఇక మిగిలిన పధవులను పరిశీలిస్తే…
AP Nominated Posts: జిల్లాకు ఈ పోస్టులే…!!
జూపూడి ప్రక్కభాకర్ (సామజిక న్యాయం సలహాదారుడు).., కాకుమాని రాజశేఖర్ (లెదర్ బోర్డు చైర్మన్).. బత్తుల సుప్రజ (ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్) .. బాచిన కృష్ణ చైతన్య (సొసైటీ ఫర్ ఏపీ శాప్ నెట్).., చింతలచెరువు సత్యన్నారాయనరెడ్డి (రెడ్డి కార్పొరేషన్)
సింగరాజు మీనా కుమారి (ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ).., రాచగోళ్ళు వెంకట సుశీల(జిల్లా గ్రంధాలయ సంస్థ).., రావి పద్మ డీసీఎంఎస్ .., మదాసి వెంకయ్య డీసీసీబీ , షేక్ సుభాషిణి (టైలర్ కార్పొరేషన్) కేటాయించారు.