Friday, May 3, 2024
Home విశ్లేషణ Sachivalaya Posts: ఆ పోస్టుల భర్తీ ఎప్పుడు..!? సచివాలయ అభ్యర్థుల వేచి చూపులు..!!

Sachivalaya Posts: ఆ పోస్టుల భర్తీ ఎప్పుడు..!? సచివాలయ అభ్యర్థుల వేచి చూపులు..!!

- Advertisement -

Sachivalaya Posts: నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది..! ఒకరకంగా ఏపీ ప్రభుత్వానికి రాజకీయంగానూ సవాలుగా మారింది.. కొన్ని చోట్ల అవకాశాలు లేక.. ఉన్నా అందిపుచ్చుకోలేక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు..! కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అవకాశాలు ఉన్నప్పటికీ.., ఖాళీలు ఉన్నప్పటికీ.. భర్తీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ.., అన్ని అర్హతలు సాధించి వేచి చూస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పోస్టుల భర్తీ జరగడం లేదు. వైసీపీ ప్రభుత్వం గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వడంతో పాటూ.., సాధారణ ప్రజలకు సేవలను సులభతరం చేసింది. ఈ విభాగంలో జిల్లాలో 1, 2, 3 క్యాటగిరిలో ఉన్న ఖాళీలలను భర్తీ చేయడం లేదు. నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.. దీంతో అన్ని అర్హతలు సాధించిన నిరుద్యోగులు నష్టపోతున్నారు..!

Sachivalaya Posts: As per June List

Sachivalaya Posts: మొత్తం 100 పోస్టుల ఖాళీలు..!!

సచివాలయ క్యాటగిరి 1, 2, 3 లో స్లేయిడింగ్, నాన్ జాయినింగ్ పోస్టులు 27 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబరులోనే రాత పరీక్ష నిర్వహించారు. ఒక పోస్టుకి ఇద్దరు చొప్పున ఎంపిక చేసి, ధ్రువపత్రాల పరిశీలనా కూడా పూర్తి చేశారు. స్లేయిడింగ్ ప్రక్రియ దగ్గర నిలిపి వేశారు. దీని ప్రకారం ఒక అభ్యర్థి ఏదైనా 2, 3 ఉద్యోగులాలకు ఎంపికైనప్పటికీ ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు. 2019 లో జరిగిన మొదటి దశలో ఇలా ఎంపికలు పూర్తి చేశారు. కానీ 2020 నవంబర్ నాటి ప్రక్రియను మాత్రం పూర్తి చేయకుండా వదిలేశారు. దీనిలో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా.., డిజిటల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేసారు. మిగిలినవి పట్టించుకోలేదు.

  • సచివాలయంలో సుమారుగా 100 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ 5, మహిళా కానిస్టేబుల్ 27, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ 30, వార్డు ప్లానింగ్ 7, ఇలా దాదాపు 19 రకాల విభాగాల్లో సుమారుగా 100 ఖాళీలున్నట్టు ఈ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు మార్లు జిల్లా కలెక్టర్, జేసీలను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అన్ని అర్హతలు సాధించి కూడా పోస్టులను భర్తీ చేయకపోవడం తమకు అన్యాయం చేసినట్టేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...