Home వార్తలు చంద్రబాబు దత్త పుత్రుడు మందకృష్ణ మాదిగ : చెరుకూరి కిరణ్

చంద్రబాబు దత్త పుత్రుడు మందకృష్ణ మాదిగ : చెరుకూరి కిరణ్

టిడిపికి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలి? చంద్రబాబు హయాంలో మాదిగలు సంక్షేమంను మరిచినప్పుడు ఏమి చేశారు? చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యి ప్యాకేజీ లు తీసుకుని మాదిగలు అభివృద్ధి కి తూట్లు పొడిచింది మందకృష్ణ మాదిగ కాదా వైసిపి ఎస్సీ మాదిగ విభాగం రాష్ట్ర నాయకులు చెరుకూరి కిరణ్ ప్రశ్నించారు. చంద్రబాబు దత్త పుత్రుడు మందకృష్ణ మాదిగని ఆరోపించారు. మంగళవారం టంగుటూరు లో స్థానిక జూనో బేకరి లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాదిగల అభివృద్ధే నా లక్ష్యమని అందుకు పోరాటం చేస్తానని బూటకపు మాటలు చెప్పి… నేడు ఎన్డీఏ కూటమి కి ఓట్లు వేయాలని మంద కృష్ణ మాదిగ ప్రచారం చేయడం మాదిగలను మోసం చేయడమేనని విమర్శించారు. అసెంబ్లీ ,పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గాల్లో సగం సీట్లు మాదిగలకు కేటాయించే విధంగా మందకృష్ణ మాదిగ చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాదిగలు అభివృద్ధి కి ఐదు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మాదిగలు కు ప్రాధాన్యత ఇచ్ఛి అసెంబ్లీ కు పంపించారు. మాదిగలు అభివృద్ధి కి కృషి చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ కు ఎన్నికలు సమయంలో అండగా మాదిగలు ఉండాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ మాటలు విని మోస పోవద్దని మాదిగలను కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పోరేషన్ సాధన సమితి నాయకులు పలువురు పాల్గొన్నారు.

Exit mobile version