Home వార్తలు మరోసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే : దస్తగిరి

మరోసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే : దస్తగిరి

నా ఎస్సీ,ఎస్టీ,బిసి అని చెప్పే సిఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వారికి ఏమీ చేసారు ? ముస్లిం లకు రంజాన్ తొఫా ఎందుకు ఇవ్వలేదని జై భీం రావ్ భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రశ్నించారు. మంగళవారం కడపలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….వైసిపి ప్రభుత్వంలో ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టీ జైల్ కు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమాయకపు ప్రజలను మోసం చేస్తూ తప్పుడు హామీలతో మళ్ళీ గద్దెను ఎక్కాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి కు ఓటు వేస్తే మన గొంతును మనం కోసుకునట్లే అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు.

వారు చేస్తే లాజిక్..మేము చేస్తే లా?

దళితులను కొట్టడం నీ నైజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందుర పడేస్తే కేసు కట్టిన పాపాన పోలేదు.ఎమ్మెల్సీ అనంత బాబు తన కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సరైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు చేస్తే లాజిక్ నా ? మేము చేస్తే లా అడ్డం వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యంగ కంటే రాజారెడ్డి,జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని పేర్కొన్నారు. మైనార్టీల మీద మోదీ కక్షతో మోదీ సిఎఎ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రజలు నరుక్కొనే విధంగా కాకుండా ….ప్రజలను బాగు పరిచే విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version