Home వార్తలు వైసిపిలో బానిస బ్రతుకు ఎందుకు సురేష్ ? పిల్లి మాణిక్యరావు

వైసిపిలో బానిస బ్రతుకు ఎందుకు సురేష్ ? పిల్లి మాణిక్యరావు

దళిత ఓట్లతో అధికారం లోకి వచ్చామనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి దళితులను అవమానిస్తున్నారు అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మానిక్యరావు ధ్వజమెత్తారు. బుధవారం మంగళగిరి లో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వెలిగొండ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేస్తూ…స్థానిక ఎమ్మెల్యే,మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ ను సిఎం పక్కన కూర్చో పెట్టుకోవలసింది పోయి… కూర్చున్న మంత్రిని లేపి బయటకు పంపించి నిలువు కాళ్ళ మీద ఒక శిక్షలా ఇచ్చిన సంఘటన మొత్తం దళిత జాతిని అవమానించారని మండిపడ్డారు. ఇద్దరు దళిత నాయకులను లేపి అగ్ర వర్గాలకు చెందిన వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ ను సిఎం తన పక్కన కూర్చోపెట్టుకున్నారని విరుచుకుపడ్డారు.


జరిగిన అవమానం మీద మంత్రి ఆధిమూలపు సురేష్ స్పందించాలని,జగన్మోహన్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు,హత్యలు,హత్యా చారాలు 500 పైగా జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పదవి అహంకారం నెత్తికి ఎక్కి దళితుల మీద దాడులు జరుగుతున్న ముఖ్యమంత్రి స్పందచలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుధాకర్,అనిత ,అచ్చన్న డాక్టర్లు మీద దాడులు జరిగినపుడు వైసిపి దళిత ప్రజా ప్రతినిదులు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు.ఇప్పుడు దళితులు,మేధావులు మీద దాడులు చివరకి దళిత ప్రజాప్రతినిధులు మీదకే వచ్చింది అని గుర్తు చేశారు.

Exit mobile version