Home వార్తలు ఓటమి భయంతోనే జగన్ రెడ్డి కారుకూతలు : దేవినేని ఉమా

ఓటమి భయంతోనే జగన్ రెడ్డి కారుకూతలు : దేవినేని ఉమా

జగన్ రెడ్డి కళ్ళలో ఓటిమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఓటమి భయంతోనే పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం మంగళగిరి లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్ రామిరెడ్డి వలన ఆర్టీసీ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. అయినా కూడా సర్విస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెంకట్ రామిరెడ్డి పాల్గొంటున్నారని… ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఎన్నికల కమిషన్‌కు ఎవరూ అతీతులు కారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరాం అని ఉమా తెలిపారు.

Exit mobile version