Home వార్తలు Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…! నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి..!!

Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…! నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి..!!

Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారి పై రైల్వే గేటు సమీపంలో జీపు టైరు పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్గటన లో నలుగురు ఎస్కార్ట్ పోలీసులు మృతి చెందారు.

ఓ ఆర్మీ జవాను అంత్యక్రియల కోసం బొలెరో వాహనం లో ఆర్మీ సిబ్బంది వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి, అదుపు తప్పి లారీ ని ఢీ కోట్టి పక్కనే ఉన్న డీవైడర్‌ పైకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదం లో ఏ ఆర్ ఎస్ఐ కృష్ణం నాయుడు హెడ్ కానిస్టేబుల్స్ జనార్థనరావు, ఆంటోనీ, కానిస్టేబుల్ బాబూరావులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న స్థానిక పోలీసులు వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Exit mobile version