Home వార్తలు Road Accident: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Road Accident: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Road Accident:ఆదివారం అర్థరాత్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై చనిపోయి పడి ఉన్న గేదెను ఎక్కిన టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.  

Exit mobile version