Home వార్తలు Ongole News: ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఒంగోలు పోలీసులు..!!

Ongole News: ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఒంగోలు పోలీసులు..!!


Ongole News: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నంకు సిద్ధపడిన ఓ వ్యక్తిని ఒంగోలు జి ఆర్ పీ పోలీసులు కాపాడారు. విషయంలోకి వెళితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన సోమిశెట్టి మాలకొండయ్య గుప్తా (36) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటి నుండి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్ రాసి దాన్ని వాట్సాప్ నందు స్నేహితులకు పంపి ఒంగోలు రైల్వే స్టేషన్ కు వెళ్లాడు.

విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు వెంటనే ఒంగోలు జిఆర్ పీ సీఐ వై రామారావుకు ఫోన్ చేసి మాలకొండయ్య గుప్తాను కాపాడాలని వేడుకున్నారు. వెంటనే స్పందించిన సీఐ రామారావు జిఆర్ పీ ఎస్ఐ పి వెంకటేశ్వరరావు, సిబ్బందిని ఒంగోలు రైల్వే స్టేషన్ కు పంపించారు. మూడు బృందాలుగా పోలీసులు రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ పై అతని ఆచూకి కోసం గాలించారు. ఒంగోలు రైల్వే స్టేషన్ కు దక్షిణం వైపు కొద్ది దూరంలో రైల్వే ట్రాక్ పై మాలకొండయ్య గుప్తా ఉండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే అతన్ని కాపాడి జీఆర్ పీ స్టేషన్ కు తీసుకొని వచ్చి తదుపరి అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి మాలకొండయ్య గుప్తాను కాపాడిన జీఆర్ పి సీఐ రామారావు, ఎస్ఐ పి వెంకటేశ్వర్లు ఇతర సిబ్బందిని ఆయన కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు అభినందించారు.

Exit mobile version