Home వార్తలు పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా : ముద్రగడ

పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా : ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించలేని పక్షంలో తన పేరును మార్చుకుంటానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరును పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తనపై పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు పిఠాపురం నుంచి తన్ని తరిమేస్తారని హెచ్చరించారు. విషయంపై అవగాహన లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని రైలు దహనం ఘటనలో పవన్ పక్కనే ఉండే జ్యోతుల నెహ్రు అప్పుడు వైసీపీ లోనే ఉన్నారని వివరించారు. తుని రైలు సంఘటనకి చంద్రబాబే కారణమని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు.

కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి ఉన్న హక్కు ఏమిటి ?

వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి ఉన్న హక్కు ఏమిటి ? కాపు ఉద్యమానికి ఎప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాను చవటను,దద్దమ్మను ఐతే… కాపులు కోసం పవన్ ఎందుకు రోడ్డు ఎక్కలేదని నిలదీశారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని, అసలు పవన్ కళ్యాణ్ అడ్రెస్ ఏమిటని ధ్వజమెత్తారు.సినిమల్లో నటించండి, రాజకీయాలు లో కాదు…. జనసేన పార్టీ త్వరలో ఫ్యాకప్ అవుతుందని జోస్యం చెప్పారు.

చంద్రబాబు ఆస్తుల వెల్లడించాలి

రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదన్నారు.తనను తీహార్ జైలుకి పంపించాల ని చంద్రబాబు ప్రయత్నం చేసారని తెలిపారు. 1978లో చంద్రబాబు,తాను ఒకేసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళామని అన్నారు.1978లో శిధిలమైన పెంకుటిల్లుకు మరమ్మతులు చేయించడానికి చంద్రబాబు వద్ధ డబ్బులు లేవని తెలిపారు. మీకు అప్పుడున్న ఆస్తులు ఎంత,ఇప్పుడున్న ఆస్తులు ఎంతో వివరాలును వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version