Thursday, May 2, 2024
Home వార్తలు Modi Rice: రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్..

Modi Rice: రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్..

- Advertisement -

Modi Rice: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభ వార్త అందించింది. మోడీ ఉచిత బియ్యం పంపిణీని మార్చి వరకూ కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిన సంగతి తెలిసింది. కార్డులోని ప్రతి వ్యక్తికి 5కేజీల వంతున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. గత సంవత్సరం మే నెల నుండి నవంబర్ వరకూ పీఎంజీకేఏవై పథకం కింద ఈ ఉచిత బియ్యం పంపిణీ స్కీమ్ అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గత నెల డిసెంబర్ కోటాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి బియ్యం పంపిణీకి ఉత్తర్వులు రాకపోవడంతో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదు.

- Advertisement -

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉచిత బియ్యం (పీఎంజికేఏవై) పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి 29వ తేదీ వరకూ ఉచిత బియ్యం పంపిణీని రేషన్ ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ లోగా రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలకు పీడీఎస్ గోడౌన్ ల నుండి పిఎంజికేఏవై బియ్యం తోలకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల కోటా 5 కేజీల బియ్యంతో పాటు డిసెంబర్ నెల కోటా 5 కేజీలు కూడా కలిపి పది కేజీల బియ్యం వంతున పంపిణీకి ఆదేశాలు ఇచ్చింది.  

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...