Thursday, March 23, 2023
Home వార్తలు ఏపి నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి .. సీఎంఓలోకి పూనం మాలకొండయ్య

ఏపి నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి .. సీఎంఓలోకి పూనం మాలకొండయ్య

- Advertisement -

ఏపి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రేపు రిటైర్ అవ్వనున్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్న 2024 జూన్ వరకూ అంటే సుమారు ఏడాదిన్నరకుపైగా ఈ పోస్టులో కొనసాగనున్నారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, టీటీడీ ఈఓగా, పలు కీలక శాఖల్లోనూ బాధ్యతలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేసింది. సీనియారిటీ జాబితాలో ఉన్న పూనం మాలకొండయ్య ను సీఎంఓలోకి తీసుకున్నారు. ఆమెను సీఎం జగన్ స్పెషల్ సీఎస్ గా నియమించారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా మదుసూధనరెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మహ్మద్ దివాన్ లను ప్రభుత్వం నియమించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న బుడితి రాజశేఖర్ ను జీఏడిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

Most Popular

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్...