Friday, April 26, 2024
Home వార్తలు ఏపి నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి .. సీఎంఓలోకి పూనం మాలకొండయ్య

ఏపి నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి .. సీఎంఓలోకి పూనం మాలకొండయ్య

- Advertisement -

ఏపి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రేపు రిటైర్ అవ్వనున్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్న 2024 జూన్ వరకూ అంటే సుమారు ఏడాదిన్నరకుపైగా ఈ పోస్టులో కొనసాగనున్నారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, టీటీడీ ఈఓగా, పలు కీలక శాఖల్లోనూ బాధ్యతలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేసింది. సీనియారిటీ జాబితాలో ఉన్న పూనం మాలకొండయ్య ను సీఎంఓలోకి తీసుకున్నారు. ఆమెను సీఎం జగన్ స్పెషల్ సీఎస్ గా నియమించారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా మదుసూధనరెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మహ్మద్ దివాన్ లను ప్రభుత్వం నియమించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న బుడితి రాజశేఖర్ ను జీఏడిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...