Sunday, April 28, 2024
Home వార్తలు పులివెందులలో పోటీకి సామాన్యుడుకు అర్హత లేదా ? : దస్తగిరి

పులివెందులలో పోటీకి సామాన్యుడుకు అర్హత లేదా ? : దస్తగిరి

- Advertisement -

పులివెందులలో పోటీ చేయబోయే దస్తగిరి నీ కొడుకేనా? మా అన్న జగన్ మీద పోటీ చేసేంత మొగోడా వాడు.నిన్ను వాడ్ని అందర్నీ చంపుతామని అని ముగ్గురు వైసిపి అనుచరులు శివరాత్రి ఉత్సవాల్లో ఉన్న తన తండ్రి హజపీరాను బెదిరించి కత్తితో దాడి చేసారని జై భీం భారత్ పార్టీ పులివెందుల ఇంఛార్జి దస్తగిరి ఆరోపించారు. తనను పులివెందులలో పోటీ చేయనియ్యకుండా అడ్డుకోవటానికి ,హత మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.ఒక సామాన్యుడు పులివెందలో పోటీ చేసే అర్హత లేదా అని ప్రశ్నించారు. తన తండ్రి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలతో కూడిన రాజకీయ పార్టీలో ఉన్నాం కనుక ..మీలాంటి దాడులు మాకు సరిపడవని పేర్కొన్నారు. తన తండ్రి కి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.

తాను పులివెందులలో జగన్ మీద పోటీలో ఉంటే అతను ఒడిపోయే పరిస్థితి ఉంటుందని, అందుకు భయబ్రాంతులకు గురైన జగన్ రెడ్డి ,అవినాష్ రెడ్డి తన పై,తన కుటుంబం పై పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. నా మీదకు కానీ నా కుటుంబం మీదకి వస్తే ఎవరని వదలనని హెచ్చరించారు. తన తండ్రి మీద జరిగిన దాడిపై పిటిషన్ వేస్తామని అన్నారు…ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదని, భయపడే పరిస్థితి లేదు. మీకు చేతనైతే నన్ను ఏమైనా చేయండి..నా కుటుంబం జోలికి రావద్దు అని హెచ్చరించారు.

- Advertisement -

అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉండటం వలనే దాడులు

- Advertisement -

అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయట ఉండటం వలనే తనపై, తన కుటుంబం మీద దాడులు జరుగుతున్నాయని,వివేక హత్య కేసులో సరిగా విచారణ జరగడం లేదన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాలని,అందుకు సుప్రీం కోర్టు ను ఆశ్రయిస్తామని తెలిపారు. తను జైలు లో ఉండగా హత్య ప్రయత్నం చేసేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసేందుకు వైసిపి నాయకులు పన్నాగం పన్నుతున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...