Home వార్తలు Tragedy: గుంటూరు జిల్లాలో ఘోర దుర్ఘటన..!రొయ్యల చెరువు వద్ద ఆరుగురు సజీవ దహనం..!!

Tragedy: గుంటూరు జిల్లాలో ఘోర దుర్ఘటన..!రొయ్యల చెరువు వద్ద ఆరుగురు సజీవ దహనం..!!

electric shock tragedy in guntur dist
electric shock tragedy in guntur dist

Tragedy: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఘోర విషాదం జరిగింది. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రేపల్లె మండలం లంకేవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన కార్మికులు కాపలాదారులుగా ఉంటున్నారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఘటన స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ అధికారులు మాత్రం ప్రమాదానికి కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని చెబుతున్నారు. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేందర్, నవీన్ లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version