Friday, April 26, 2024
Home వార్తలు bomb threat call: బాంబు బెదిరింపుతో రైళ్లలో విస్తృతంగా తనిఖీలు

bomb threat call: బాంబు బెదిరింపుతో రైళ్లలో విస్తృతంగా తనిఖీలు

- Advertisement -

bomb threat call: రైైలులో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తం అయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 00 కి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన రైల్వే పోలీసులు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే రైళ్లను ఆపి తనిఖీలు చేశారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తున్న ఎల్టీజీ ఎక్స్ ప్రెస్ ను కాజీపేటలో నిలుపుదల చేసి తనిఖీ లు చేపట్టారు.

- Advertisement -

చర్లపల్లిలో కోణార్క్ ఎక్స్ ప్రెస్, కాజీపేటలో తోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను నిలుపుదల చేసి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, రైల్వే పోలీసులు జాగిలాలతో అన్ని బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను పరిశీలించారు. పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైయ్యారు. అయితే ఏ రైలులోనూ బాంబులు దొరకకపోవడంతో పోలీసులు, రైల్వే పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇతర రైళ్లను తనిఖీలు చేశారు. ఇది ఫేక్ కాల్ గా అధికారులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది. ఎవరు చేశారు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...