Friday, April 26, 2024
Home వార్తలు Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ..ఆరుగురు మృతి

Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ..ఆరుగురు మృతి

- Advertisement -

Fire Accident: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని రసాయన కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 14 మందికిపైగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో కింద విభాగంలో పని చేస్తున్న కార్మకులు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను, మృతుల వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని తొలుత నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తొంది. మృతుల్లో నలుగురు బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు.

ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భాంతి .. మృతుల కుటుంబాలకు 25 లక్షల వంతున పరిహారం

- Advertisement -

ఏలూరు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంత వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల వంతున పరిహారం ప్రకటించారు. ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

బుధవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా 13 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులు నూజివీడు, విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

Most Popular

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...