Home వార్తలు పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత

పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత

అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్ ను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. వీటిని హైకోర్టు కొట్టివేసింది. పాదయాత్రపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో.. పార్టీలు కాని వారు పిటిషన్లు వేస్తే అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

థర్డ్ పార్టీ పిటిషన్ వేయడం న్యాయబద్దం కాదని పేర్కొంది. రైతాంగ సమాఖ్య తరపున పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లు కోరారు. మథ్యంతర దరఖాస్తులను కొట్టివేయడంతో .. రిట్ అప్పీల్ కు కూడా విచారణ అర్హత లేదని హైకోర్టు పేర్కొంది. పాదయాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలనే పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది.   

Exit mobile version