Sunday, May 5, 2024
Home విశ్లేషణ Mandali Budda Prasad: జగన్ సర్కార్‌కు మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!

Mandali Budda Prasad: జగన్ సర్కార్‌కు మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!

- Advertisement -

Mandali Budda Prasad: జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల తెలుగు అకాడమి పేరును తెలుగు – సంస్కృత అకాడమిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివిధ వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ద ప్రసాద్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డికి  ఆయన లేఖ రాశారు. అకాడమి పేరు మార్చడంపై ప్రజాబిప్రాయం ఎలా ఉందో ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయనీ, సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వివరించారు.

- Advertisement -

సంస్కృత భాషాబివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదనీ, అందు కోసం ప్రత్యేకంగా అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. తమ మాటలను ఎదుటి వారు వినాలని కోరుకునే వారు ఇతరుల మాటలను గౌరవించాలనీ, ఇది ప్రజాస్వామ్య మూలసూత్రమని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందే తప్ప నష్టమేమీ ఉండదని మండలి బుద్దప్రసాద్ అన్నారు.

- Advertisement -

తెలుగు అకాడమి పేరు మార్పును తెలుగు – సంస్కృత అకాడమి అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా ఎవరూ సమర్ధించడం లేదని అన్నారు.

- Advertisement -

తెలుగు అకాడమి పేరు మార్చడంపై అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి. మంత్రులు పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి తదితరులు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ఈ అంశంపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలను విమర్శిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...