Saturday, April 20, 2024
Home విశ్లేషణ Pawan Kalyan: పవన్ పుట్టిన రోజు వేడుకకు 50 రోజుల ముందు సోషల్ మీడియాలో సరికొత్త...

Pawan Kalyan: పవన్ పుట్టిన రోజు వేడుకకు 50 రోజుల ముందు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండింగ్..!!

- Advertisement -

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో తమ సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ అభిమానుల శక్తి ముందు వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు దిగదుడుపే. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎటువంటి వార్త అయినా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ దూసుకుపోతుంటారు. ఎప్పటి కప్పుడు ట్రెండింగ్ లోకి రకరకాల టాపిక్ లు తెస్తుటారు. గత మూడేళ్లపాటు రాజకీయ రంగంలో బిజీగా ఉన్న పవన్ ప్రస్తుతం మళ్లీ సినీరంగంలోకి అడుగు పెట్టి అనేక సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు వెళుతుండటంతో అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. పవన్ ఒప్పుకుంటున్న ప్రాజెక్టులు అభిమానులకు మరింత ఆనందాన్ని కల్గిస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ కు సంబంధించి పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కాగా తాజాగా పవన్ అభిమానులు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 50 రోజుల ముందుగా హాష్ టాగ్ పవనోత్సాహంను సోషల్ మీడియాలో సెట్ చేశారు.  

సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం. దీనిని పురస్కరించుకుని పవన్ అభిమానులు సరికొత్త ట్రెండ్ ను సోషల్ మీడియాలో సెట్ చేశారు. పవనోత్సాహం అనే హాష్ టాగ్ వైరల్ చేస్తున్నారు. ఇదే తరుణంలో పవన్ కల్యాణ్ తన జన్మదినోత్సవం నాడు దగ్గుబాటి రాణా తో చేస్తున్న మల్టీ స్టారర్ మువీ టీజర్, అదే విధంగా హరిహర వీరమల్లు మువీకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ రిలీజ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభమయ్యే మువీ ఫస్ట్ లుక్ తో టైటిల్ తో కూడిన పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూడు సినిమాలు ఒప్పుకున్నారు. అందులో రెండు సెట్స్ పై ఉన్నయి. మరొకటి ప్రారంభం కావాలి. అయ్యపనం కోషియం రీమేక్ షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేసినా కానీ షూటింగ్ వాయిదా పడింది. ఈ వారం చివర గానీ వచ్చే వారం గానీ షూటింగ్ మొదలు అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...