Friday, May 3, 2024
Home వార్తలు రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

- Advertisement -

అమరావతి రాజధాని విషయంలో ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఏపి హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. కాలపరిమితికి సంబంధించిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఏపి రాజధానిని సీఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతిలోనే కొనసాగించాలని హైకోర్టు ఆరు నెలల క్రితం ఇచ్చిన తీర్పుపై ఏపి సర్కార్ .. సుప్రీం కోర్టు లో ఎస్ఎల్పీ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం విచారణ జరిపింది, ఏపి ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, రైతుల తరపున సీనియర్ కౌన్సిల్ లు శ్యామ్ దివాన్, ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు వాదనలు జరగగా ఇరుపక్షాలకు పలు అంశాలపై ధర్మాసనం ప్రశ్నలను సంధించింది.

ఇరుపక్షాల వాదనల అనంతరం ఏపి హైకోర్టులో గతంలో ఇచ్చిన పలు ఆదేశాలపై స్టే ఇచ్చింది. నిర్దీత కాల పరిమితిలో రాజధానిలో అభివృద్ధి పనులు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు.. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. నిర్ణీత వ్యవధిలో రాజధానిలో పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు విధించడంతో ఏపి సర్కార్ కు స్వల్ప ఊరట లభించినట్లు అయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...