Friday, April 26, 2024
Home వార్తలు రైతుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్

రైతుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్

- Advertisement -

వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రబీ 2020 – 21, ఖరీఫ్ 2021 సీజన్లకు చెెందిన వైెస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్ – 2022 సీజన్ లో వివిధ రకాల వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ తో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ గడచిన మూడేళ్లలో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమ చేయగా, తాజాా గా జమ చేసిన మొత్తం 21.31 లక్షల మంది రైతులకు రూ.1,834,79 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ జమ చేసినట్లు అవుతుందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతులు మద్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఫరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి ఉండేదని అన్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరి కొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించే వారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఈ క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగు దారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. అంతే కాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కింద రైతు భరోసా కేంద్రాల్లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు, అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించామని సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు న్యాయం జరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి రైతులు తేడా ను గమనించాలని విజ్ఢప్తి చేశారు, మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉంటాయని జగన్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

Most Popular

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...