Sunday, April 28, 2024
Home వార్తలు CM Jagan Delhi Tour: ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం...

CM Jagan Delhi Tour: ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ

- Advertisement -

CM Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో వేరువేరుగా భేటీ అయ్యారు. ముందుగా ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్.. దాదాపు 45 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రుణ పరిమితిపై సీలింగ్ ఎత్తివేత, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీలు తదితర అంశాలపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. అదే విధంగా దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి జరిగిన ఒప్పందాల విషయాలను మోడీకి వివరించినట్లు తెలుస్తొంది. ఇదే సందర్భంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయని భావిస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ మద్దతు అంశంపైనా చర్చ జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మోడీతో భేటీ ముగిసిన అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ సమావేశమైయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.17వేల కోట్ల విడుదల చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. నిధుల సమీకరణకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లకు ఆదేశాలకు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. కాగా ఈ రాత్రి జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం 10గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...