Thursday, March 28, 2024
Home వార్తలు Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా .. బాబు కోటరీపై కీలక వ్యాఖ్యలు

Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా .. బాబు కోటరీపై కీలక వ్యాఖ్యలు

- Advertisement -

Divyavani: తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపిన దివ్యవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖలో మాత్రం తన వ్యక్తిగత కారణాలు అని పేర్కొన్నప్పటికీ మీడియా సమావేశంలో పార్టీ కార్యాలయంలో రాజకీయాలను ప్రస్తావించారు.  ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి తర్వాత దాన్ని ఆమె డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దివ్యవాణి బుధవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తరువాత కొద్దిసేపటికే తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంత కాలంగా పార్టీ అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతూ వస్తున్నారని, పార్టీలో అవమానాలకు తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశం పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఓ దశలో దివ్యవాణి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన లాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి అలా ఉంటున్నారని దివ్యవాణి అన్నారు. గౌరవం లేని చోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు బుధవారం పార్టీ ఆఫీసుకు వెళితే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని దివ్యవాణి అవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే..అందరికంటే ముందు తానే కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. సినీ రంగంలో బాలకృష్ణ కంటే తానే పెద్ద నటినని పేర్కొన్నారు.  టీడీపీలోకి సినీ రంగం నుండి వచ్చిన అనేక మంది ఇమడలేక బయటకు వెళ్లిపోయారంటూ జయప్రద, జయసుధ,  ఆలీ, రోజా పేర్లను ప్రస్తావిస్తూ ఇప్పుడు తన వంతు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు దివ్యవాణి.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...