Thursday, May 9, 2024
Home Uncategorized Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి, పునీత్ రాజ్ కుమార్ మరణాలపై అందరూ షాక్ ..!...

Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి, పునీత్ రాజ్ కుమార్ మరణాలపై అందరూ షాక్ ..! ఎందుకంటే..?

- Advertisement -


Mekapati Goutham Reddy: గతంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, నేడు ఏపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ల మరణాలపై అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వీళ్ల ఇద్దరిలో ఒక సారూప్యత ఉంది. ఇద్దరూ క్రమం తప్పకుండా జిమ్ చేస్తారు. ఫిట్ గా ఉంటారు. తమ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ద తీసుకుంటారు. కానీ ఇద్దరూ చిన్న వయసులోనే గుండె పోటుతో మృతి చెందడం విస్మయాన్ని, ఆందోళనను కల్గిస్తున్నాయి. వివాద రహితుడుగా పేరున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. ఏపి యువ మంత్రుల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఒకరు. మంత్రుల అందరిలో ఫిట్ గా ఉంటూ.. కండలు తిరిగిన వీరుడుగా.. ఆరు అడుగుల అజానుబాహుడిగా ఉండే వారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇటీవలే దుబాయ్ కు వెళ్లిన గౌతమ్ రెడ్డి అక్కడ బిజినెస్ ఎక్క్పో లో పాల్గొని నిన్ననే ఇండియా (హైదరాబాద్)కు తిరిగి వచ్చారు. రాగానే నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుకకు హజరై మళ్లీ రాత్రికి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు.

Mekapati Goutham Reddy: ఈ రోజు ఏమి జరిగింది..?

గౌతమ్ రెడ్డి తన దిన చర్యలో భాగంగా రోజు 5.30 గంటలకే నిద్ర లేచి కాఫీ తాగి వెంటనే వ్యాయామం చేయడానికి జిమ్ కు వెళతారు. కానీ ఈ రోజు ఆలస్యంగా నిద్ర లేచారు. రాత్రి పడుకోవడం ఆలస్యం కావడంతో 7గంటల సమయంలో లేచారు. కాఫీ తాగకుండానే జిమ్ కు వెళ్లడానికి రెడీ అవుతుండగా అలసటగా ఛాతి నొప్పిగా ఉండటంతో 7.20గంటలకు ఇంట్లోని సోఫాపై కూర్చుని వెంటనే రెండు నిమిషాల్లో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనకు చెమటలు పట్టాయి. వెంటనే ఇంట్లో ఉన్న వంట మనిషి, సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయి అంబులెన్స్ పిలిపించి జూబ్లిహిల్స్ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్ లో వెళుతున్న సమయంలోనే గౌతమ్ రెడ్డి సృహతప్పిపోయారని సమాచారం. ఆసుపత్రికి వెళ్లిన వెంటనే కార్డియాలజిస్ట్ లు, స్పెషలిస్ట్ లు అత్యవసర వైద్య సేవలు అందించినా ఫలితం కనబడలేదు. దాదాపు 90 నిమిషాల పాటు వైద్యులు ఆయనకు సిపిఆర్ చికిత్స అందించారు. కార్డియాలజిస్ట్ లు ఆయనను బ్రతికించేందుకు శత విధాలుగా ప్రయత్నించినా ఆయన శరీరం సహకరించలేదు. 9.16 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఏపి, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, సినీ సెలబ్రిటీలు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

పునీత్ రాజ్ కుమార్ కూడా…

- Advertisement -

కన్నడ సినీ సెలబ్రిటీ పునీత్ రాజ్ కుమార్ కూడా గౌతమ్ రెడ్డి మాదిరిగానే నిత్యం జిమ్ చేస్తుంటారు. పిట్ గా ఉంటారు. ఆయన శరీర సౌష్టవం కూడా జిమ్ బాడీగా కనిపిస్తుంది. ఈ యువ హీరో గత ఏడాది అక్టోబర్ 29న ఉదయాన్నే జిమ్ చేస్తూనే గుండె పోటుకు గురై మరణించారు. అదే వయసు, అదే తరహా వ్యాయామపు అలవాట్లు…అదే సమయం.. అదే తరహా మరణం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Zencasino Online Casino Review And Bonus

1st November 2023 – CASINO.COM has Closed Down and is not taking gamers. It’s crucial that casinos display a license from a legitimate licensing body on their site. Examples of the trusted authorities we look out for embrace the UK Gambling Commission (UKGC), Malta Gaming Authority (MGA), Kahnawake Gaming Commission, along with many others. Licensed casinos keep your private and monetary information protected and publicly list their RNG audits and RTP reports in order that you know exactly what you're in for. Learn all about factoring in casino house edge and recreation odds to determine the payout in an exhaustive information. The Resorts app is pretty fast, so you need to find no problem in transferring between on line casino pages in your smartphone or pill.

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

Best Gambling Establishments that Approve Bitcoin: A Comprehensive Overview

Bitcoin, the globe's first electronic currency, has acquired significant appeal recently. Consequently, an increasing number of mifinity casino on the internet casinos have started...

Most Popular

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...