- Advertisement -
YSRCP: ఏపిలో ఈ నెల 26వ తేదీ నుండి నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాలను ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మంత్రులు నిర్ణయించారు. ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ తో మంత్రులు సమావేశమై చర్చించారు. ఈ బస్సు యాత్ర, బహిరంగ సభల ప్రతిపాదనకు సీఎం జగన్ అంగీకరించినట్లు సమాచారం. శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తూ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీ శ్రీకాకుళం లేదా విజయనగరంలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
- Advertisement -