- Advertisement -
Road Accident: ప్రకాశం జిల్లా మల్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. జిల్లాలోని కంభం నుండి శ్రీశైలం వెళుతున్న కారు టైరు పేలడంతో తిమ్మాయపాలెం వద్ద ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనతో కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా ధగ్ధమైంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనం అయ్యారు.
- Advertisement -
సమాచారం అందుకున్న మల్కాపురం సీఐ ఆంజనేయులు రెడ్డి, ఎస్ఐ సుమన్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారు డ్రైవర్ ను చిత్తూరు జిల్లా బాకరావుపేటకు చెందిన రావూరి తేజ (35) గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -