AP Govt: ఏపిలోని పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా బీసీ కార్పోరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావును డిప్యూటేషన్ పై ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న కె భాగ్యలక్ష్మి అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న పివివిఎస్ మూర్తిని అదే మున్సిపాలిటీలో ఆర్డీఎంఎగా నియమించారు. ఇక్కడ ఆర్డీఎంఏగా ఉన్న జి నాగరాజును విశాఖపట్టణం మున్సిపల్ కార్పోరేషన్ లో ఆర్డీఎంఎ నియమించారు.