Home వార్తలు ఇప్పటంలో వైయస్సార్ విగ్రహాలనూ తొలగించిన అధికారులు

ఇప్పటంలో వైయస్సార్ విగ్రహాలనూ తొలగించిన అధికారులు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఆక్రమణ తొలగింపు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ నాయకుల విగ్రహాలను కూడా తొలగించారు. అయితే గ్రామాల్లో ఉన్న దివంగత సీఎం వైయస్సార్ విగ్రహల జోలికి అధికారులు వెళ్లలేదు. దీనిపై ఇటీవల ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. జనసేన ఆవిర్భావ సభకు సహకరించారన్న కక్షలోనే గ్రామంలో అవసరం లేకపోయినా రోడ్డు విస్తరణ అంటూ ఇల్లు, ప్రహరీలు కూల్చేసారని పవన్ ఆరోపించారు. జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించిన అధికారులు వైయస్సార్ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు.

దీనిపై విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లిన తర్వాత ఒక వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారు. అయితే టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ఈరోజు ఇప్పటం గ్రామంలో పర్యటించడంతో అధికారులు విమర్శలకు తావు లేకుండా ఉండేందుకు రహదారిపై ఉన్న మరో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా తొలగించారు.

Exit mobile version