Friday, April 26, 2024
Home వార్తలు Yeluri Sambasivarao: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్వంలో 28న...

Yeluri Sambasivarao: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్వంలో 28న నిరసన..!!

- Advertisement -

Yeluri Sambasivarao: వైసీపీ ప్రభుత్వ పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆందోళనకు సమాయత్తం అవుతోంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ  బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతుందని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఇంకొల్లు మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు జరిగే నిరసన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

పన్నుల భారంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఏలూరి అన్నారు. పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏలూరి  ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెంపుతో వ్యవసాయం భారంగా మారిందని అన్నారు. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మళ్లీ పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.  డిసెంబర్ 2020లో రూ. 681 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా రూ.900కు పెరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపిందని విమర్శించారు.

- Advertisement -

ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు తక్షణమే చేపట్టాలని ఏలూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని అన్నారు. మద్య నిషేధం అమలు చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...