TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి జాబితా ఖరారు అయ్యింది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాలకమండలి సభ్యుల నియామకంపై కసరత్తు పూర్తి చేశారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి గత నెల 11వ తేదీన రెండవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బోర్డు సభ్యుల విషయానికి వచ్చేసరికి వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను నియమించాల్సి ఉండటంతో జాప్యం జరిగింది. వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో నేతల సిఫార్సులను పరిగణలోకి తీసుకుని బోర్డు సభ్యుల కూర్పు పూర్తి అయినట్లు సమాచారం. 25 మందితో తుది జాబితా సిద్దం అయ్యింది. మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు అవుతారు. బోర్డు మెంబర్స్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం పాలకమండలిలో చోటు లభించిన సభ్యులు వీరే..
పాలకాల అశోక్, మల్లాడి కృష్ణారావు, మోహోం రామేశ్వరరావు, మారుతి, జీవన్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, జే శ్రీనివాస్, రాజేశ్ శర్మ, సౌరభ్, కన్నయ్య, మారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, నందకుమార్, సంతోష్, వేమిరెడ్డి పార్థసారధి రెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, లక్ష్మీనారాయణ, మిలిద్, శశిధర్, శ్రీమతి కృష్ణంరాజు రాజోలు, శంకర్, విశ్వనాధరెడ్డి, మథుసూధన్ యాదవ్, గోళ్ల బాబూరావు, కాటసాని రాంభూపాల్ రెడ్డి లు సభ్యులుగా నియమితులైనట్లు తెలుస్తోంది.