- Advertisement -
Tragedy: ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో చిన్నారులు సహా అయిదుగురు
అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.శిధిలాల్లో చిక్కుకున్న ఇద్దరు మహిళలను రక్షించి వారిని సమీపంలోని ఆసుపత్రికి
తరలించారు.
తొమ్మిది సంవత్సరాల బాలికతో సహా ముగ్గురు వ్యక్తులు శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద మరో ఇద్దరు చిక్కుకుని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మూడు జేసీబీలు, హైడ్రా మిషన్ లతో శిదిలాలను తొలగిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
- Advertisement -