నాడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేసి రక్తపు మరకలను ఏ విధంగా ఐతే కడిగేసారో… నేడు సిట్ కార్యాలయంలో ఐదేళ్లగా వైసిపి చేసిన అవినీతి పాపాలను కడిగేసి ప్రయత్నం జరుగుతోంది అని టిడిపి అధికార ప్రతినిధి కోమ్మారెడ్డి పట్టాభి రామ్ ఆరోపించారు.సోమవారం మంగళగిరిలో టీడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సిట్ కార్యాలయం లో ఫైళ్ల దహనం పై కచ్చితమైన విచారణ జరిపించాలని ఎన్నికల కమిషనర్ ను కోరారు. రాష్ట్ర సెక్రటేరియట్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ధ భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. కొల్లి రఘురామిరెడ్డి అధిపతి గా ఉన్న సిట్ కార్యాలయంలో కట్టల కట్టలు డాక్యుమెంట్స్ ను తగలపెడుతూ అడ్డంగా దొరికిపోయారని మండిపడ్డారు.గత ఐదేళ్లుగా తెలుగుదేశం నేతల మిద అక్రమ కేసులు పెట్టడానికి ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టించారు అని ధ్వజమెత్తారు. రాబోయే టిడిపి ప్రభుత్వంలో ఫేక్ డాక్యుమెంట్స్ పై విచారణ జరిగితే తమ జీవితాలు తారుమారు అవుతాయి అన్న ఉద్దేశంతో కొల్లి రఘురామిరెడ్డి, సీఐడీ అధికారులు ఫేక్ డాక్యుమెంట్స్ ను దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జీరాక్స్ మెషీన్లు వేడెక్కి కొన్ని కాగితాలు ఇరుక్కుపోయాయని, జిరాక్స్ మెషీన్లలలో ఇంక్ లేక ప్రింట్ అవ్వలేదని , వాటన్నిటినీ తగలపెడుతున్నట్లు సిట్ కార్యాలయం ప్రకటన విడుదల చేయటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. జిరాక్స్ మెషీన్లు లో హెరిటేజ్ కు చెందిన కాగితాలు …సిట్ అధికారులు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్స్ మాత్రమే ఇరుక్కుపోతాయా ? అడ్డంగా మీడియా కు దొరికిపోయి ఇలాంటి ప్రకటనలు ఇస్తారా అని నిలదీశారు.రాబోయే టిడిపి ప్రభుత్వంలో రెడ్ బుక్ లో ఉన్న అధికారాల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.