- Advertisement -
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఆమోదించిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్తో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు పార్లమెంటు, 5 అసెంబ్లీ (రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు సిటీ) స్థానాలపై ఉమ్మడి అవగాహన కుదిరింది. మిగతా 5 స్థానాలపై చర్చలు కొనసాగించి నామినేషన్లోగా ఒక అవగాహనకు రావాలని ఉభయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. సిపిఐ(యం) సిపిఐ పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో పరస్పరం బలపర్చుకోవాలని సిపిఐ, సిపిఐ(యం) ఉమ్మడి అవగాహనకు వచ్చాయి.
పార్లమెంటు :
- అరకు (ST) – పాచిపెంట అప్పలనర్స
అసెంబ్లీ : - రంపచోడవరం (ST) – లోతా రామారావు
- అరకు (ST) – దీసరి గంగరాజు
- కురుపాం (ST) – మండంగి రమణ
- గాజువాక – మరడాన జగ్గునాయుడు
- విజయవాడ సెంట్రల్ – చిగురుపాటి బాబురావు
- గన్నవరం – కళ్ళం వెంకటేశ్వరరావు
- మంగళగిరి – జొన్నా శివశంకర్
- నెల్లూరు సిటీ – మూలం రమేష్
- కర్నూలు – డి.గౌస్దేశాయి
- సంతనూతలపాడు (SC) – ఉబ్బా ఆదిలక్ష్మి
- Advertisement -