టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు పిలుపు మేరకు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో బాపట్ల పార్లమెంటు పరిధిలో జరిగే చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం బస్ యాత్ర టూర్ షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, అరాచక పాలనను అంత మెందించేందుకు, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని కాపాడేందుకు తారక రాముడు స్ఫూర్తితో ఈ నెల 20వ తేదీ నుండి బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
20వ తేదీ నుండి మూడు రోజుల పాటు
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు ఏలూరి. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం చంద్రన్న మినీ మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. నరకాసుర పాలన విముక్తి కోసం జరిగే ఈ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇంటికొకరు చొప్పున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి 23 వరకు బాపట్ల పార్లమెంట్ పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో భవిష్యత్ గ్యారెంటీ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 20న బాపట్ల నియోజకవర్గంలో, 21న చీరాల నియోజకవర్గంలో, 22న పర్చూరు నియోజకవర్గంలో, 23న సంతనూతలపాడులో ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు,సీనియర్ నేతలతో 45 మంది సభ్యులతో నియోజకవర్గ ఇన్ చార్జిలు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.
తొలి రోజు బాపట్ల నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర వివరాలు ఇలా..
20 వ తేదీన ఉదయం 11.00 నుండి 11.30 గంటలకు భావన్నారాయన స్వామి గుడిలో పూజా కార్యక్రమం
ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకూ బాపట్ల పట్టణంలో జమ్ములపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు
మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకూ బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులతో భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో పై సమావేశం
మధ్యాహ్నం 01.00 నుండి 1.30 ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో సమావేశం
మధ్యాహ్నం 01.30 నుండి 3.00 భోజన కార్యక్రమం,
సాయంత్రం 03.00 నుండి 5.00 గంటల వరకూ సెల్ఫీ కార్యక్రమం
వెదుళ్లపల్లి శివారు బదిరుల పాఠశాల దగ్గర వైసీపు నేతల అక్రమ ఇసుక త్రవ్వకాలు
వెదుళ్లపల్లి శివారు టీడీపీ ప్రభుత్వం లో నిర్మించిన దివ్యాంగుల కాలనీ
బాపట్ల పట్టణంలో 34 వ వార్డు దగ్గుమల్లివారిపాలెం లో టీడీపీ ప్రభుత్వం లో నిర్మించిన క్రిస్టియన్ భవన్
బాపట్ల పట్టణం ఉప్పరపాలెం టీడీపి ప్రభుత్వం లో నిర్మించిన మంచినీటి ట్యాంకు
బాపట్ల పట్టణం మునిసిపల్ కార్యాలయం వద్ద టీడీపి ప్రభుత్వం లో నిర్మించిన క్రీడా వికాస కేంద్రం
బాపట్ల హైస్కూలు లో టీడీపి ప్రభుత్వం లో నిర్మించిన తరగతి భవనాలు
సాయంత్రం 05.00 నుండి 8.00 గంటల వరకూ కర్లపాలెం మండలం పెరలి గ్రామంలో లో రచ్చబండ కార్యక్రమం
అనంతరం రాత్రి కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బస.