Friday, April 26, 2024
Home వార్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు

- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హజరు కాని ముగ్గురికి సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులతో ఫోన్ సంభాషణలు జరిపిన, పరోక్ష ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ నేత తుషార్, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ లను విచారణకు హజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేయగా, ఈ నెల 21న (నిన్న) విచారణకు శ్రీనివాస్ తప్ప మిగిలిన వారు హజరుకాలేదు.

జగ్గుస్వామికి నోటీసులు ఇచ్చేందుకు కేరళకు వెళ్లిన పోలీసులకు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆశ్రమ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలు  హజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సిట్ .. వీరిపై లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేసింది. న్యాయవాది శ్రీనివాస్ ఈ రోజు మరో మారు సిట్ విచారణకు హజరైయ్యారు.

- Advertisement -

వీరికి సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులో విచారణకు హజరుకాకపోతే 41 – ఏ (3), (4) సిఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణ అధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసుపై బీజేపీ హైకోర్టు ఆశ్రయించగా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ సంతోష్ ను అరెస్టు చేయవద్దని సిట్ ను న్యాయస్థానం ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

Most Popular

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...