Wednesday, May 1, 2024
Home వార్తలు President Election: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదల..జూలై 18న పోలింగ్..21న కౌంటింగ్

President Election: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదల..జూలై 18న పోలింగ్..21న కౌంటింగ్

- Advertisement -

 

President Election: భారత రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేశారు. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ ఈ నెల 15న జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 15వ తేదీ నుండి 29 తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తామనీ, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. జూలై 2వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా చెప్పారు. జూలై 18న పోలింగ్, 21న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 25లోగా నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా షెడ్యుల్ ను ఖరారు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జరుగుతాయని చెప్పారు. పోలింగ్ మాత్రం పార్లమెంట్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఆవరణలో జరగనున్నట్లు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. ఎన్నికలకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని రాజీవ్ కుమార్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...