Home వార్తలు సిఎం పై దాడి వివరాల గురుంచి ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కీలక ప్రకటన

సిఎం పై దాడి వివరాల గురుంచి ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కీలక ప్రకటన

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినవారి వివరాలను తెలిపినవారికి రెండు లక్షల నగదును బహుమతిగా అందిస్తామని ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌వారి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 13 వ తేదిన విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వైయస్ జగన్మోహన్‌ రెడ్డి పై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి దోహదపడే కచ్చితమైన సమాచారమును, దృశ్యాలను అందించవచ్చునని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన కచ్చితమైన సమాచారము అందించే వారు ఫోన్‌ ద్వారా గాని, వాట్స్‌ అప్‌ ద్వారా గాని, లేదా నేరుగా గాని వచ్చి తెలియజేయగలరని వివరించారు.ఫోన్‌ నెంబర్లు కంచి శ్రీనివాసరావు, డి.సి.పి. ఎన్‌.టి.ఆర్‌. పోలీస్‌ కమిషనరేట్‌ 9490619342.ఆర్‌.శ్రీహరిబాబు, ఏ.డి.సి.పి.టాస్క్‌ ఫోర్సు 9440627089 ఆఫీస్‌ అడ్రస్‌ : కమిషనర్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్‌, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట్‌, కృష్ణలంక, విజయవాడ. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చునని తెలిపారు.. ఈ సమాచారమును అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Exit mobile version