Sunday, April 28, 2024
Home వార్తలు ఎన్నికల ప్రక్రియ,మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలకు ముకేశ్ కుమార్ మీనా కీలక సూచనలు

ఎన్నికల ప్రక్రియ,మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలకు ముకేశ్ కుమార్ మీనా కీలక సూచనలు

- Advertisement -

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని త్వరలో జరుగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు ఆయన అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్కుషాపు జరిగింది. ఈ సందర్బంగా ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ… భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు, సూచనలపై రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులకు సమగ్ర అవాగాహన ఏర్పర్చుకుంటే ఎన్నికల్లో ఎటువంటి సందేహాలకు, గందరగోళానికి తావు వుండదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ మరియు వ్యయ పర్యవేక్షణ అనే అంశాలు ఎంతో కీలకమైన అంశాలన్నారు. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.
కుల, మత, భాష ప్రాతిపదిక ఓటర్లను ప్రేరేపించడం నిషిద్ధం
ఈ అంశాలకు సంబందించి సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని.. అయితే నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తదుపరి వస్తుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించాలన్నా, ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుదన్నారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే ఎటు వంటి కార్యక్రమాలను అయినా పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కుల, మత, భాష ప్రాతిపదిక ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్దమని హెచ్చరించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న సమయంలో అభ్యర్థులు, ఏజంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు మరియు రూ.10 వేలకు మించి విలువైనా వస్తులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్దమన్నారు. స్టార్ క్యాంపైనర్లు లక్ష రూపాయలు కు మించి నగదు కలిగి ఉండ కూడదన్నారు. పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే లోక్ సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసన సభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగాని లేదా ఆర్.బి.ఐ./ట్రెజరీ ద్వారా సెక్యురిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుదన్నారు. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులను అనుమతించడం లేదన్నారు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్.ఓ.లు, ఏఆర్ఓలు నామినేషన్లను స్వీకరిస్తారన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలిపివేయడం జరుగుతుంది, అభ్యర్థితో కలుపుకుని మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతించడం జరుతుందన్నారు.

- Advertisement -

ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుదన్నారు. ప్రతి లోక్ సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ విధంగా అనుమతించిన వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నగదు, బహుమతులు, లిక్కరు మరియు ఇతర వస్తులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్దమైన వ్యయంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుందని, రోజువారి రిజిస్టరుతో పాటు నగదు, బ్యాంకు రిజిష్టర్లను కూడా తప్పనికి సరిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

చాలా జిల్లాల్లోనూ ఇప్పటికే సంబందిత జిల్లా ఎన్నికల అధికారు వర్కుషాపులు నిర్వహించి ఈ అంశాలను అన్నింటినీ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించండ జరిగిందని, మిగిలిని జిల్లాల్లో కూడా త్వరలో వర్కుషాపులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైఎస్సార్సీపి), ఎ.రాజేంద్రప్రసాద్ (టిడిపి), ఐ.కె.అన్నపూర్ణ (బిజెపి), వె.వి.రావు (సిపిఐ-ఎం) పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

Most Popular

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...