- Advertisement -
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లీ కూతురు ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతు అయ్యారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కూడా గల్లంతు అయ్యారు. ఈ ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టే,షన్ పరిధిలోని ఐలాపూర్ చెరువులో జరిగింది.
విషయంలోకి వెళితే …తల్లీకూతురు యాదమ్మ, లావన్య (15) లు బట్టలు ఉతికేందుకు ఐలాపూర్ చెరువుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు చెరుపులో పడిపోయారు. ఇది గమనించిన ఓ వ్యక్తి వారిని కాపాడేందుకు చెరువులోకి దిగి గల్లంతు అయ్యాడు. ఆ తర్వాత గజఈతగుళ్లు గాలించగా, లావన్య (15) మృత దేహం లభ్యమైంది. ఆమె తల్లి యాదమ్మ, ఆమెను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి ఆచూకి కోసం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు సమాచారాన్ని పోలీస్ లకు అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -