ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిలకు ఈ రోజు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒకొక్కరికి రూ.2లక్షల పూచికత్తు పై ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం ఈడీకి అనుమతి ఇచ్చింది. ఇద్దరు నిందితులను అయిదు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు నిందితులను కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది.
మరో పక్క లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారిన ప్రముఖ వ్యాపారి దినేశ్ అరోరా స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. దినేశ్ అరోరా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సన్నిహితుడు. అప్రూవర్ గా మారిన దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ కోర్టుకు మూడు రోజుల క్రితం సీబీఐ కోరింది. కోర్టు ఆదేశాలతో దినేశ్ అోరోరాను సీబీఐ అధికారులు కోర్టులో హజరుపర్చగా ఆయన స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది.