Home వార్తలు TTD: తిరుమల శ్రీవారికి కోటిన్నరకు పైగా విలువైన బంగారం వితరణ

TTD: తిరుమల శ్రీవారికి కోటిన్నరకు పైగా విలువైన బంగారం వితరణ

TTD: శ్రీ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన ఒ ప్రముఖ సంస్థ బారీగా బంగారాన్ని విరాళంగా అందించింది. శ్రీవారికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వారి స్తోమత కొలది విరాళాలను అందిస్తుంటారు. ఈ క్రమంలోనే కొయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.83కోట్ల విలువైన 3.60 కిలోల బంగారం బిస్కెట్లను స్వామివారికి విరాళంగా సమర్పించింది.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఇఓ ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు బంగారం బిస్కెట్ లను అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి ప్రసాదాలను అందించారు.  

Exit mobile version