AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సమావేశమైయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, నిరంజన్ రెడ్డి, ఆలీ, నారాయణ మూర్తి తదితరులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని జగన్ తో సమావేశమైయ్యారు. ఏపిలో గత కొంత కాలంగా సినిమా టికెట్ల అంశంపై తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే నాగార్జున సతీమణి అమలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో నాగార్జున హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ హజరుకాకపోవడానికి కారణం వెల్లడికాలేదు. ఇప్పటికే ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.